
Dimagi Naxal Party : ఇన్స్టాగ్రామ్లో ఉన్నట్టుండి వెలిసిన ఒక అకౌంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. దిమాగీ నక్సల్ పార్టీ పేరుతో దర్శనమిచ్చిన ఈ అకౌంట్, తెరుచుకున్న ఒక్కరోజులోనే ఏకంగా 1.6 లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఎంత వేగంగా ఇది వెలుగులోకి వచ్చిందో, అంతకంటే వేగంగానే అకస్మాత్తుగా మాయమైపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఈ ఆగస్టు నెలలోనే ప్రారంభమైన ఈ ఖాతాలో మొత్తం 62 పోస్టులు ఉండగా, కేవలం 35 ఇతర అకౌంట్లను మాత్రమే ఇది ఫాలో అయ్యింది. అలాగే దీని యూజర్ నేమ్ను కూడా ఒకసారి మార్చినట్లు సమాచారం. అయితే, అసలు ఈ పేజీని ఎవరు సృష్టించారు, దీని వెనుక ఉన్నది ఎవరు అనే విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో దిమాగీ నక్సల్స్ అనే పదాన్ని వాడటంతో ఈ అంశం తీవ్ర దుమారం రేపింది. అడవుల్లో సాయుధ నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేశామని, కానీ ఈ దిమాగీ నక్సల్స్ ప్రమాదం మాత్రం ఇంకా పొంచి ఉందంటూ మోదీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
Also Read : NTA మరో నిర్లక్ష్యం: UGC-NETలో తప్పులు, సెప్టెంబరులో రీ-ఎగ్జామ్స్!
We are Followers of Bhagat Singh…
If THEY try to suspend our accounts or label us Anti-Nationals..
Just know- They are disrespecting Bhagat Singh. pic.twitter.com/DdzMCcsVIV
— Dimagi Naxal Janta Party (@DNJP_India) August 16, 2026
కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం స్పందిస్తూ నేను దిమాగీ నక్సల్గా ఉండటానికి గర్వపడుతున్నాను అని ట్వీట్ చేయగా, ప్రధాని ఆ వ్యాఖ్యలు ప్రతిపక్షాలను ఉద్దేశించి చేయలేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వివరణ ఇచ్చారు. ఈ రాజకీయ వేడి నడుమ ఇన్స్టాగ్రామ్లో ఈ విచిత్ర అకౌంట్ రావడం, వెంటనే డిలీట్ కావడం గమనార్హం.
Also Read : అస్సాం సీఎంకు బెదిరింపులు.. నిందితుడి అరెస్టు









