BIG BREAKIG : నేపాల్‌లోని పశ్చిమ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైనట్లు నేపాల్ జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం వెల్లడించింది. అధికారుల వివరాల ప్రకారం, ఉదయం కచ్చితంగా 4:40 గంటలకు భూకంపం సంభవించింది. బజ్‌హాంగ్ జిల్లాలోని కోట్‌దేవాల్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూకంప ప్రభావంతో బజ్‌హాంగ్ జిల్లాతో పాటు పొరుగు జిల్లాలైన బైతాడి ప్రాంతంలోని పలు చోట్ల కూడా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితిని స్థానిక అధికారులు, భద్రతా సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.