గతంలో 2008 ఆర్థిక సంక్షోభాన్ని, కరోనా మహమ్మారిని ముందే ఊహించి ప్రపంచాన్ని అప్రమత్తం చేసిన ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్ట్ రాబర్ట్ పెస్టన్.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి హెచ్చరికలు చేశారు. రాబోయే ఒకటి రెండేళ్లలోనే ఏఐ కారణంగా ఉద్యోగాలు ఊడిపోయి, ప్రపంచవ్యాప్తంగా పెను ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

Also Read : ఎర్ర సముద్రంలో నౌకలపై దాడి.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

పెస్టన్ రాసిన కొత్త పుస్తకం ది కిల్ స్విచ్‌లో ఈ విషయాలను వెల్లడించారు. ఏఐ సాంకేతికత విపరీతంగా పెరిగిపోతుండటంతో ప్రతి రంగంలోనూ మానవ శ్రమ స్థానంలో యంత్రాలు వచ్చేస్తున్నాయని పేర్కొన్నారు. కంపెనీలన్నీ మనుషులను తీసేసి ఏఐ సిస్టమ్స్‌ను వాడుకోవడానికి రెడీ అవుతుండటంతో.. త్వరలోనే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే భయాందోళనకర పరిస్థితి రాబోతోందని హెచ్చరించారు.

అసలు ఈ ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం ఏఐ ప్రాజెక్టుల కోసం జరుగుతున్న అపరిమిత పెట్టుబడులే అని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు, పెద్ద కంపెనీలు ఏఐ డేటా సెంటర్లు, భారీ పవర్ ప్లాంట్ల నిర్మాణాల వైపే తమ వేల కోట్ల నిధులను తరలిస్తున్నాయి. దీనివల్ల సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అసమతుల్యత ఏర్పడి, బ్యాంకింగ్, ఆర్థిక రంగాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పెస్టన్ అన్నారు.

కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోతే.. ప్రజల దగ్గర రాబడి ఉండదు. దాంతో ప్రభుత్వాలకు అందే ఆదాయపు పన్ను కూడా పూర్తిగా పడిపోతుంది. పన్నులు రాకపోతే దేశాలను నడపడం, ప్రజా సంక్షేమం చూసుకోవడం ప్రభుత్వాలకు కష్టంగా మారుతుంది. ఏఐ వేగంగా ఉద్యోగాలను మింగేస్తున్న తరుణంలో ప్రపంచ ప్రభుత్వాలు తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలని పెస్టన్ హెచ్చరిస్తున్నారు.

Also Read : భారత్‌కు బిగ్ రిలీఫ్.. 60 దేశాలపై అమెరికా టారిఫ్ బాంబు.. వీటి వెనుక ట్రంప్ అసలు ప్లాన్ ఇదే!