Jaish terror center పాకిస్థాన్‌ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహ్మద్‌ సంస్థకు చెందిన బహావల్‌పూర్ కేంద్రాన్ని గత ఏడాది ఆఫరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారత్‌ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. కాగా, భారత్ దాడుల్లో ధ్వంసమైన ఆ భవనాన్ని ఉగ్ర సంస్థ జైష్ ఏ మహ్మద్ పూర్తిస్థాయిలో పునురుద్ధరించింది. పాక్‌ పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ కేంద్రం ఉంది. తాజాగా ఆ సంస్థ ధ్వంసమైన తమ ప్రధాన కార్యాలయాన్ని మళ్లీ పునరుద్ధరించినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. దీనికి పాకిస్థాన్‌ ప్రభుత్వం ఆర్థికంగా సహకారం అందించినట్లు నిఘా వర్గాల వెల్లడించాయి. ఈ ఘటనతో పాక్‌ మరోసారి తన ఉగ్రబుద్ధిని చాటుకున్నట్లు తేలింది. జైషే కార్యాలయానికి సంబంధించిన శాటిలైట్‌ చిత్రాలు, భవనంలో కొత్తగా వేసిన మార్బుల్స్‌, పెయింట్లు, నూతనంగా నిర్మించిన డోమ్‌ల ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటం సంచలనంగా మారింది. భారత్‌ దాడుల్లో ఈ కేంద్రం పైకప్పులో పెద్ద రంధ్రం పడిన విషయం తెలిసిందే. ఈ కేంద్ర ప్రాంగణంలోని ఇతర కట్టడాలు కూడా దెబ్బతిన్న విషయం తెలిసిందే.

పహల్గాం దాడికి ప్రతీకారంగా గత సంవత్సరం మే 7న భారత ఆర్మీ అత్యంత కచ్చితత్వంతో ఆ భవనంపై బాంబులతో దాడి చేసింది. ఈ ఘటనలో జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబ సభ్యులు 10 మంది పూర్తిగా చనిపోయారు. దీంతో పాక్‌లో ఉన్న ఉగ్రమూలాల గురించి ప్రపంచానికి తెలిసినట్లయింది. ఇంతా జరిగినా పాక్‌ తన బుద్ధిని మార్చుకోలేదు. నాటి దాడి తాలూకు అనవాళ్లు ఏవీ కనిపించకుండా కేంద్రాన్ని పునరుద్ధరించుకోవడానికి సాయం అందించింది. దీని కోసం పాక్ ప్రభుత్వ వర్గాలే సుమారు రూ.25 కోట్ల (పాక్ కరెన్సీ)ను సమకూర్చాయని నిఘా వర్గాలు వెల్లడించాయి.

కాగా, ఉగ్రదాడిలో ధ్వంసమైన ఈ భవనంలోని సెంట్రల్ హాల్ పునరుద్ధరణకే రూ.11 కోట్లు ఖర్చైనట్టు చెప్తున్నారు. గతేడాది జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం దాడిలో 26 మందిని ఉగ్రవాదులు బలితీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా పాక్‌లోని ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్‌ ప్రయోగించింది. ఆ దాడిలో ధ్వంసమైన భవనాన్ని తిరిగి నిర్మించడంతో మళ్లీ ఉగ్ర కార్యకలాపాలను సాగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ జైషే మహ్మద్‌ ప్రధాన కార్యాలయంలో క్యాడర్‌కు శిక్షణతో పాటు, ఉగ్ర సిద్ధాంతాలు బోధిస్తారు. ఈ భవనం మొత్తం మొత్తం 18 ఎకరాల్లో విస్తరించి ఉంది. 2001లో భారత పార్లమెంట్‌పై దాడి ఘటన, 2016లో పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ పై దాడితో పాటు, పుల్వామా ఆత్మాహుతి దాడి తదితర వ్యూహాలు అన్ని ఇక్కడే పన్నినట్లు సంబంధిత వర్గాలు చెబుతాయి. కాగా అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఈ కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదంలోకి కొత్త వారిని చేర్చుకోవడం, వారికి శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటాయి. జైష్‌పై పాక్ 2002లోనే నిషేధం విధించినట్లు ప్రకటించినప్పటికీ ఉగ్రవాదులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందుతూనే ఉన్నాయి.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.