Eluru

Eluru : మ్యాట్రిమోనియల్ సైట్లలో పెళ్లి పేరుతో మహిళలను మోసం చేస్తున్న ఓ కిలాడీ దొంగను ఏలూరు జిల్లా ముదినేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆ తర్వాత బెదిరింపులకు దిగి మహిళల నుంచి డబ్బులు, బంగారం వసూలు చేస్తున్న ఒక ఇంటర్-స్టేట్ క్రిమినల్‌ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ పర్యవేక్షణలో, టెక్నికల్ ఇంటెలిజెన్స్ , లోకల్ సమాచారం ఆధారంగా పోలీసులు నిందితుడిని ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు.

Also Read : మత సామరస్యానికి ప్రతీక ‘పీర్ల పండుగ’… త్యాగాల స్మరణలో మొహర్రం…చారిత్రక నేపథ్యం ఏంటంటే?

ఆస్ట్రేలియాలో సెటిల్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పాండురంగారావు నగర్‌కు చెందిన వక్కలగడ్డ సాంబశివరావు (36) అనే వ్యక్తి ఈ మోసాలకు పాల్పడుతున్నాడు. తాను మీడియా ఇండస్ట్రీలో ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అని, తన సిస్టర్ ఆస్ట్రేలియాలో సెటిల్ అయిందని, పేరెంట్స్ హై-ప్రొఫైల్ పొజిషన్స్‌లో ఉన్నారంటూ అబద్ధాలు చెప్పి బాధితుల నమ్మకాన్ని సంపాదించేవాడు. ఈ విధంగా 2020 నుంచి ఇప్పటివరకు మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా దాదాపు 40 మందికి పైగా మహిళలను టార్గెట్ చేసి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి క్యాష్, గోల్డ్ దండుకున్నట్లు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది.

ముదినేపల్లి మండలానికి చెందిన ఓ కేసులో.. బాధితురాలికి నమ్మకాన్ని కల్పించిన నిందితుడు, ఆ తర్వాత ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి 10 సవర్ల బంగారం, లక్ష రూపాయల క్యాష్ లాక్కున్నాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని పట్టుకోగా, మిగతా మహిళలను కూడా ఇదే తరహాలో మోసం చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు.

నిందితుడి దగ్గరి నుంచి పోలీసులు ఎనిమిది సవర్ల గోల్డ్ ఆర్నమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 24 గ్రాముల మంగళసూత్రం చైన్, రెండు గోల్డ్ రింగ్స్, ఒక జత గోల్డ్ ఇయర్ రింగ్స్, ఒక గోల్డ్ చైన్ ఉన్నాయి. వీటితో పాటు ఆరు మొబైల్ ఫోన్లు, 10 సిమ్ కార్డులు, నాలుగు బ్యాంక్ పాస్‌బుక్కులు, తొమ్మిది ఏటీఎం కార్డులను పోలీసులు సీజ్ చేశారు. బాధితులను నమ్మించడానికి నిందితుడు వాడిన నాలుగు బ్రాస్లెట్లు, ఐదు రింగ్స్, మూడు చైన్లు, రెండు పాపిడి బిళ్లతో కూడిన రోల్డ్-గోల్డ్ నగలను కూడా రికవరీ చేశారు. ఎంతో స్కిల్డ్‌గా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసును ఛేదించిన పోలీస్ టీమ్‌ను ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ అభినందించారు.

Also Read : నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త: అక్టోబర్‌లో ‘మెగా డీఎస్సీ-2026’

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.