-RAVI PRAKASH

Pune Crime : దేశమంతా ఇప్పుడు ఒకే కేసు గురించి మాట్లాడుకుంటోంది. డైనింగ్ టేబుళ్ల దగ్గర..డ్రాయింగ్ రూమ్‌లలో..కార్పొరేట్ ఆఫీసుల్లో..కాలేజీ క్యాంపస్‌లలో..వాట్సాప్ గ్రూపుల్లో..సోషల్ మీడియాలో..ఎక్కడ చూసినా ఇదే చర్చ. అదేంటంటే..ఒక హత్య…ప్రజలను షాక్‌కు గురిచేసింది. ప్రేమ, నమ్మకం, మానవ సంబంధాలు, మోసం గురించి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తిన మర్డర్..ఇది 26 ఏళ్ల కేతన్ అగర్వాల్..20 ఏళ్ల సియా గోయల్ స్టోరీ.

కొన్ని వారాల క్రితం వరకు ఇది ఒక అందమైన ప్రేమకథలా కనిపించింది. ఈ ఏడాదే వీరిద్దరి పెళ్లి జరగాల్సి ఉంది.ఇద్దరి కుటుంబాలు పెళ్లి సంబరాల్లో మునిగిపోయాయి. స్నేహితులు కూడా పార్టీలు చేసుకున్నారు.సోషల్ మీడియాలో కొత్త జంట ఫొటోలు వైరల్ అయ్యాయి. అన్నీ సవ్యంగానే సాగుతున్నాయని అనుకుంటున్న టైమ్‌లో సడెన్‌ బ్రేక్‌ పడింది..పోలీసుల దర్యాప్తు ప్రకారం…ఆ చిరునవ్వుల వెనుక మరో కథ నడుస్తోంది. అది ఎవరూ ఊహించని కథ. అదొక సీక్రెట్‌ రిలేషన్‌..వేలాది ఫోన్ కాల్స్…ఉన్నట్టుండి క్యాన్సిల్‌ అయిన బాలి ట్రిప్…మాయమైన పాస్‌పోర్ట్…మళ్లీ మళ్లీ ఒకే స్పాట్‌కు అంటే లోహగడ్‌ కోటకు వెళ్లడం..చివరికి… ఒక ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన జరిగింది.

జూన్ 18, 2026.

కేతన్ అగర్వాల్ పుణే సమీపంలోని లోహగడ్ కోటకు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన కొన్ని గంటల తర్వాత.. ప్రాణాలు కోల్పోయాడు. మొదట అందరూ అది ప్రమాదమని భావించారు. కొండపై నుంచి జారి పడిపోయాడని అనుకున్నారు. కానీ…దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ…కథ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు పోలీసులు చెబుతున్నది ఏమిటంటే…ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాకపోవచ్చు. దీని వెనుక పక్కా స్కెచ్‌ ఉండొచ్చు. కేతన్ ఎక్కువగా నమ్మిన వ్యక్తులే…కొన్ని నిజాలు దాచిపెట్టారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు… ఇది ముందుగానే ప్లాన్ చేసిన conspiracy కావచ్చని కూడా విచారిస్తున్నారు. ఈ ఆరోపణలు కోర్టులో నిజమని తేలితే… ఇటీవలి కాలంలో దేశాన్ని కుదిపేసిన అత్యంత సంచలనాత్మక రిలేషన్‌షిప్ క్రైమ్ కేసులలో ఇది ఒకటిగా నిలవొచ్చు.

అసలు ఏం జరిగింది?

కేతన్ అగర్వాల్ ఎవరు?

సియా గోయల్ ఎవరు?

చేతన్ చౌదరి పాత్ర ఏంటి?

రెండు వేలకుపైగా ఫోన్ కాల్స్‌ను పోలీసులు ఎందుకు పరిశీలిస్తున్నారు? మాయమైన పాస్‌పోర్ట్ ఇంటర్నల్‌ స్టోరీ ఏంటి?అంతకుముందే చాలా సార్లు లోహగడ్ కోటకు ఎందుకు వెళ్లారు? పెళ్లి ఏర్పాట్లు చేస్తున్న కుటుంబం…అంతిమయాత్ర ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రోజు…ఈ మొత్తం కేసును మొదటి నుంచి చివరి వరకు మీ ముందుకు తీసుకొస్తాను.. కలల పెళ్లి నుంచి…పుట్టినరోజు వేడుకల వరకు…లోహగడ్ కోట ప్రయాణం నుంచి…ఆ విషాద ఘటనపై పోలీసుల దర్యాప్తు వరకు…ప్రతి అంశాన్ని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.

ఇప్పుడు ఈ కేసు ఎందుకు దేశం దృష్టిని ఆకర్షించిందో తెలియాలంటే..ముందుగా కేతన్ అగర్వాల్ ఎవరో తెలుసుకోవాలి. కేతన్ అగర్వాల్ కామన్‌మాన్‌ కాదు. పుణేకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విశాల్ అగర్వాల్ కుమారుడు.కుటుంబ వ్యాపారంలో కూడా చురుకుగా పాల్గొనేవాడు.కేతన్‌ గురించి తెలిసినవాళ్లు చెప్పే మాట ఒక్కటే…”జీవితంలో స్పష్టమైన లక్ష్యం ఉన్న యువకుడు.” భవిష్యత్తుపై ఎన్నో కలలు. కుటుంబంపై ప్రేమ. రిలేషన్స్ పై నమ్మకం. అన్నీ కేతన్‌లో కనిపించేవి.అలాంటి కేతన్ జీవితంలో మరో ముఖ్యమైన అధ్యాయం మొదలుకాబోతోంది. అదే… సియా గోయల్‌తో వివాహం.సియా కూడా ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన యువతి. వారి కుటుంబం డ్రై ఫ్రూట్స్, మసాలాల వ్యాపారంలో మంచి పేరు సంపాదించింది.కామర్స్ స్టూడెంట్‌ అయిన సియా… సొంతగా వ్యాపారం మొదలుపెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.బయటకు చూసినవారికి ఇది ఒక పర్ఫెక్ట్ జంటలా కనిపించింది.

ఎందుకంటే, రెండు కుటుంబాలకు మంచి సంబంధాలున్నాయి. అందుకే ఇరువైపులా పెద్దలు అన్నీ అనుకున్న తర్వాతేనిశ్చితార్థం చేశారు. పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అంతేకాదు…ఈ పెళ్లిని అత్యంత వైభవంగా నిర్వహించాలని కుటుంబాలు ప్లాన్ చేశాయి. అందుకోసం ఒక రాజభవనాన్ని సెలెక్ట్‌ చేసుకున్నారు.

బాలీలో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే…రెండు కుటుంబాలు తమ జీవితాల్లోని అతిపెద్ద వేడుకకు సిద్ధమవుతున్నాయన్న మాట.స్నేహితులు, బంధువులు అందరూ వీరిని సంతోషంగా ఉన్న జంటగానే చూశారు. సోషల్ మీడియాలో కూడా అదే కనిపించింది. ఫోటోలు…వీడియోలు…బర్త్‌డే సెలబ్రేషన్స్…భవిష్యత్తు గురించి కలలు…అన్నీ చాలా బ్యూటిఫుల్‌గా కనిపించాయి.ఎక్కడా అనుమానం తలెత్తే పరిస్థితి కనిపించలేదు. కానీ…కేతన్ మరణం తర్వాత బయటకు వచ్చిన ఒక విషయం అందరినీ ఆలోచనలో పడేసింది. సియా పుట్టినరోజు కోసం కేతన్ సోషల్ మీడియాలో చేసిన ప్రత్యేక కౌంట్‌డౌన్ పోస్టులు. స్నేహితులు చెబుతున్న దాని ప్రకారం…సియాను సంతోషపెట్టడానికి కేతన్ ఎంతో ప్రయత్నించినట్లు ఆ పోస్టుల్లో కనిపించింది. అంతేకాదు.. వాటిల్లో సియాపై కేతన్‌ ప్రేమ, ఆప్యాయత, భవిష్యత్తుపై ఆశ కనిపించింది. సాధారణంగా ప్రేమలో ఉన్న జంటలు పెట్టుకునే పోస్టుల్లాగే అవి కూడా కనిపించాయి.కానీ ఇప్పుడు…ఆ ఫోటోలు, ఆ వీడియోలు మరో అర్థాన్ని ఇస్తున్నాయి.

ఎందుకంటే…పోలీసుల దర్యాప్తు చెబుతున్న కథ పూర్తిగా భిన్నంగా ఉంది.పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే…మరో రహస్య కోణం నడుస్తోందని పోలీసులు చెబుతున్నారు.సియా గోయల్‌కు 22 ఏళ్ల చేతన్ చౌదరితో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే సంబంధం ఇప్పుడు ఈ కేసులో కీలక అంశంగా మారింది.ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు…మరోవైపు రహస్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రహస్య సంబంధమే తర్వాత జరిగిన దారుణ ఘటనకు ప్రధాన కారణంగా మారిందని భావిస్తున్నారు.  అయితే…ఈ అంశం గురించి ఎవరికీ తెలియదు.కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాయి. స్నేహితులు సంబరాలకు సిద్ధమవుతున్నారు.కేతన్ మాత్రం…తాను ప్రేమించిన అమ్మాయితో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నానని నమ్ముతున్నాడు.  కానీ…అప్పుడే ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది.బాలి ట్రిప్. కనిపించకుండా పోయిన పాస్‌పోర్ట్. పోలీసుల మాటల్లో చెప్పాలంటే…అక్కడి నుంచే ఈ కథలో అసలు ట్విస్ట్ మొదలైంది. ఆ పాస్‌పోర్ట్ మిస్టరీ వెనుక అసలు ఏముంది? అదే ఇప్పుడు తెలుసుకుందాం…

Also Read : సాంకేతికత సృష్టించిన అద్భుతం… విపత్తు వేళ రక్షణ కవచంగా స్మార్ట్‌ఫోన్

జూన్ 18, 2026…

ఆ రోజు ఒక బర్త్‌ డే ఫంక్షన్‌గా మొదలైంది.కేతన్ అగర్వాల్…సియా గోయల్…ఫ్యామిలీ మెంబర్స్‌.. ఫ్రెండ్స్‌.. అందరూ కలిసి పుణే సమీపంలోని లోహగడ్ కోటకు వెళ్లారు. అది ఆనందంగా గడవాల్సిన రోజు. కానీ…కొన్ని గంటల్లోనే అది విషాదంగా మారిపోయింది. ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో..ఉన్నట్లుండి కేతన్ లోయలో పడిపోయాడు.  వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. గంటల తరబడి లోయలో కేతన్‌ కోసం వెతికారు. చివరికి కేతన్ మృతిచెందినట్లు ప్రకటించారు.

మొదట అందరూ అనుకున్నది ఒక్కటే…ఇది ఒక ప్రమాదం..ట్రెక్కింగ్ చేస్తూ కాలు జారి పడిపోయి ఉంటాడు. కేతన్‌ బ్యాడ్‌ లక్‌ అనుకున్నారు.కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కానీ…కొద్దిరోజుల్లోనే అనుమానాలు మొదలయ్యాయి. కేతన్ కుటుంబ సభ్యులకు కొన్ని విషయాలు నమ్మశక్యంగా కనిపించలేదు. ముఖ్యంగా…కేతన్ సిస్టర్ కొన్ని విషయాలను డీప్‌గా అబ్జర్వ్‌ చేసింది.  ఆమె పదేపదే సియాను ఒకే ప్రశ్న అడిగింది. “అసలు అక్కడ ఏం జరిగింది?” కరెక్ట్‌గా చెప్పు అని.. కానీ…సియా చెప్పిన సమాధానాలు..అక్కడ జరిగిన ఘటనకు సింక్‌ అవ్వడం లేదు..ఏదో జరిగిందనే అనుమానం కేతన్‌ సిస్టర్‌కు బలంగా అనిపించింది. ఎందుకంటే..స్టోరీ మారుతోంది. డీటైల్స్‌ డిఫరెంట్‌గా ఉన్నాయి.  ప్రతి సారి కొత్త విషయం బయటకు వస్తోంది. దాంతో అనుమానాలు మరింత పెరిగాయి. అవే చివరికి పోలీసుల దృష్టికి చేరాయి. లోతుగా విచారణ ప్రారంభించిన తర్వాత..ఈ కేసు పూర్తిగా కొత్త మలుపు తిరిగింది.

పోలీసులు మొబైల్ ఫోన్ రికార్డులను పరిశీలించారు. అప్పుడు వారికి షాకింగ్ ఇన్ఫర్మేషన్‌ దొరికింది.సియా గోయల్, చేతన్ చౌదరి మధ్య ఆరు నెలల కాలంలో 2 వేలకుపైగా ఫోన్ కాల్స్ జరిగినట్లు గుర్తించారు. దాదాపు 250 గంటలకు పైగానే మాట్లాడారని చెబుతున్నారు. ఇక్కడితో పోలీసులు ఆగలేదు. లోకేషన్ డేటాను కూడా పరిశీలించారు. అప్పుడు మరో కీలక విషయం బయటపడింది.కేతన్ మరణించిన రోజున…చేతన్‌ చౌదరి ఫోన్ కూడా లోహగడ్ కోట పరిసరాల్లో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ చెక్‌ చేశారు. సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశారు.ఇప్పటివరకు ప్రమాదంగా కనిపించిన ఘటన…క్రమంగా హత్య కోణంలోకి మారడం ప్రారంభమైంది.  అదే సమయంలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది.ఈ నెల ప్రారంభంలో కేతన్, సియా కలిసి బాలీకి వెళ్లాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కోసం ఈ ట్రిప్ ప్లాన్ చేసినట్లు సమాచారం.కానీ బాలి ట్రిప్‌ క్యాన్సిల్‌ అయ్యింది. కారణం… కేతన్ పాస్‌పోర్ట్ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం. అదే ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ పాస్‌పోర్ట్‌ను కావాలనే దాచిపెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు.  ఇంకో కీ పాయింట్‌ కూడా దర్యాప్తులో బయటపడింది.  అదేంటంటే?జూన్ 18న లోహగడ్ కోటకు వెళ్లడం ఇదే మొదటిసారి కాదని పోలీసులు చెబుతున్నారు.  ఇంతకుముందు కూడా అక్కడికి వెళ్లినట్లు విచారణలో తేలింది.

పోలీసులకు ఒకటి మాత్రం కన్ఫామ్ అయ్యింది.  ఇది ఇక సాధారణ ట్రెక్కింగ్ ప్రమాదం కాదు. ఇది ముందే పథకం ప్రకారం అమలు చేసిన కుట్ర కావచ్చని పోలీసులు అనుమానించడం ప్రారంభించారు. అయితే… దర్యాప్తు అక్కడితో ఆగలేదు.ఆ తర్వాత పోలీసులు సేకరించిన ఆధారాలు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.  అసలు ఆ ఆధారాలు ఏమిటి? పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారు?  కేసులో బయటపడిన అత్యంత షాకింగ్ నిజం ఏంటి? అదే ఇప్పుడు తెలుసుకుందాం…

జూన్ 23, 2026…కేతన్ మరణించిన ఐదు రోజుల తర్వాత…ఈ కేసు దర్యాప్తు ఊహించని మలుపు తిరిగింది. పోలీసులు సియా గోయల్, చేతన్ చౌదరిని అరెస్ట్ చేశారు.  హత్య…కుట్ర…సంబంధిత పలు సెక్షన్ల కింద కేసులు ఫైల్‌ చేశారు. ఈ అరెస్టులు పుణేను మాత్రమే కాదు… దేశం మొత్తాన్ని షాక్‌కు గురిచేశాయి.కానీ…ఇంకో విషయం బయటకు రావడంతో ప్రజలు మరింత ఆశ్చర్యపోయారు. కేతన్ మరణం తర్వాత… సియా సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్టు పెట్టినట్లు సమాచారం. కేతన్‌ను గుర్తు చేసుకుంటూ…బాధను వ్యక్తం చేస్తూ…ప్రేమను తెలియజేస్తూ పెట్టిన కొన్ని మెసేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ పోస్టులు చూసిన చాలామంది… ఆమె నిజంగా కేతన్‌ మరణంపై బాధపడుతోందని అనుకున్నారు.

కానీ…అదే సమయంలో పోలీసులు చేస్తున్న ఆరోపణలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. కేతన్ మరణం వెనుక జరిగిన కుట్రలో…సియా కూడా భాగమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే ఈ కేసులో అత్యంత షాకింగ్ ఎలిమెంట్‌గా మారింది. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ…కేతన్ కుటుంబ సభ్యులు కూడా ఓపెన్‌ అవుతున్నారు.  అందులో ముఖ్యంగా…కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ చెప్పిన ఒక మాట దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఆయన ఒక ప్రశ్న అడిగారు. అది కూడా చాలా కామన్‌ క్వశ్చన్‌.. కానీ… ఈ విషాద ఘటన మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి అదే కీలక ప్రశ్న. “సియాకు కేతన్‌తో పెళ్లి ఇష్టం లేకపోతే…సూటిగా ‘లేదు’ అని ఎందుకు చెప్పలేదు?” ఆమె చదువుకున్న యువతి. మంచి కుటుంబం నుంచి వచ్చింది. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే వయసు ఉంది. పెళ్లి వద్దనుకుంటే…తల్లిదండ్రులకు చెప్పొచ్చు. లేదా కేతన్‌కు చెప్పొచ్చు.నిశ్చితార్థం రద్దు చేసుకోవచ్చు. పెళ్లి ఆపేయొచ్చు. అప్పుడు..పెద్దవాళ్లం కొద్దిగా బాధపడేవాళ్లం..కొంత డబ్బు పోయినా కేతన్‌ ప్రాణాలతో ఉండేవాడు. కొద్దిరోజుల తర్వాత దాన్ని మరిచిపోయేవాళ్లం.. అని కేతన్‌ ఫాదర్‌ బాధపడుతున్నాడు. ఇప్పుడు చూడండి..కొడుకును కోల్పోయాం..సియా వద్దని చెప్పుంటే..ఈరోజు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. మనవడి పెళ్లి చూడాలని ఎదురుచూసిన తాత…న్యాయం కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండేది కాదు. ఒక అందమైన భవిష్యత్తు…అర్ధాంతరంగా ముగిసిపోయేది కాదు.ప్రస్తుతం… సియా గోయల్, చేతన్ చౌదరిపై వచ్చిన ఆరోపణలను కోర్టు పరిశీలించాల్సి ఉంది.

చివరికి నిజం ఏంటో…కోర్టు మాత్రమే నిర్ణయించగలదు. సో.. ఎవరినీ ముందుగానే దోషులుగా, నిర్ణయించడం సరైంది కాదు. ఇక్కడ ఒక విషయం మాత్రం అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది. పెళ్లి కలలు కంటున్న ఒక యువకుడు ఇక లేడు.  ఒక కుటుంబం ఛిన్నాభిన్నమైంది. ఎన్నో జీవితాలు శాశ్వతంగా మారిపోయాయి. మరి… కేతన్ తండ్రి అడిగిన ఆ ప్రశ్న ఇప్పటికీ దేశమంతా ప్రతిధ్వనిస్తోంది. “పెళ్లి ఇష్టం లేకపోతే…సూటిగా ‘లేదు’ అని చెప్పలేమా?” “ఎందుకు ఇన్ని జీవితాలు నాశనం కావాలి?” ఈ కేసులో అసలు నిజం ఏంటో…రాబోయే రోజుల్లో కోర్టు విచారణలో తేలనుంది.

Also Read : రాత్రంతా ఏడ్చాను.. సీఎం ఓదార్చారు : ఎంపీ సంచలన కామెంట్స్!

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.